Sunday, May 19, 2024

భార‌త హాకీ స్టార్ ప్లేయ‌ర్..వరుణ్ కుమార్ పై పోక్సో కేసు..!!

spot_img

భారత హాకీ స్టార్ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ పై లైంగిదాడు కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారాం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు వరణ్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేస నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం సంబంధిత వివరాలను వెల్లడించారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన జట్టులో వరణ్ కుమార్ కూడా సభ్యుడిగా ఉన్నాడు.

కాగా వరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేసిన యువతి ఎయిర్ లైన్స్ ఉద్యోగిగా పనిచేస్తోంది. 2018లో అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ తో పరిచయం ఏర్పడినప్పుడు తన వయస్సు 17ఏళ్లని బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ సమయంలో వరుణ్ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా వరుణ్ తనను కాంటాక్ట్ అయ్యాడని..తనను కలవాలని పట్టుబట్టాడని బాధితురాలో ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. తనకు మెసేజ్ లు పంపిస్తున్నాడని..తాను స్పందించకపోవడంతో చివరకు తన స్నేహితులతో తనను కలిసి తన ఇష్టాన్ని తెలిపినట్లు పేర్కొంది.

ఆ సమయంలో తాను మైనర్ అని తెలిసినా..2019 జులైలో వరుణ్ ఆమెను బెంగళూరులోని జయనగర్ లోని ఓ హోటల్ కు పిలిచాడు. అయితే బాధితురాలు ప్రతిఘటించడంతో వారి సంబంధాన్ని మరో అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇలా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ 5ఏళ్లుగా తనతో పలుమార్లు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే ఆమె వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని వరణ్ కుమార్ బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. యువతి నుంచి అందిన ఫిర్యాదు మేరకు వరుణ్ కుమార్ పై పోక్సో చట్టం కింద సోమవారం కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇది కూడా చదవండి: చిలీలో హెలికాఫ్టర్ ప్రమాదం…మాజీ అధ్యక్షుడు మ్రుతి..!!

Latest News

More Articles