ఎట్టకేలకు GHMC కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు అయ్యింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన మేయర్ మంగళవారం ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు హాజరైన ఈ సమావేశంలో మేయర్ మాట్లాడారు. స్ట్రీట్ వెండర్ పాలసీ, కాంట్రాక్టర్ల బిల్లులు, GHMC ఆర్థిక స్థితిగులతోపాటు స్టాండింగ్ కమిటీ ఎన్నిక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
కాగా అసెంబ్లీ సమావేశాలు ముసిగిన అనంతరం ఈనెల 19వ తేదీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. ఇప్పటివరకు కేవలం 7సార్లు మాత్రమే కౌన్సిల్ జరిగిందని వాటిలోనూ ప్రజాసమస్యలపై పరిష్కారంపై విస్త్రుతంగా చర్చ జరగలేదని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. వరుసగా మూడు రోజులు సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.
ఇది కూడా చదవండి: భాగ్యనగరంలో భగ్గుమంటున్న సూరీడు…4నెలలు ఎండలే ఎండలు..!!