Friday, May 17, 2024

ఐటీ ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోం చేసుకోండి

spot_img

హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగుల‌కు న‌గ‌ర పోలీసులు కీల‌క సూచ‌న చేశారు. న‌గ‌రంలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఐటీ ఉద్యోగులంతా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. వ‌ర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు సూచించారు.

అత్య‌వ‌స‌ర సేవ‌ల ఉద్యోగులు త‌మ కార్యాల‌యాల నుంచి ఇండ్ల‌కు వెళ్లేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు పోలీసులు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డ‌య‌ల్ 100కి కాల్ చేయాల‌ని సూచించారు. వానలకు సంబంధించి తెలంగాణ పోలీసు శాఖ సోష‌ల్ మీడియాలో ప‌లు సూచ‌న‌లు చేసింది.

Latest News

More Articles