తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మియాపూర్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. మియాపూర్లో ఇవాళ (సోమవారం) పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సరైన పేపర్లు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని సీజ్ చేశారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి నగలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి:బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు