Sunday, May 19, 2024

తెలంగాణ వ్యాప్తంగా షురూ అయిన పోలింగ్..!!

spot_img

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్..సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం పోలింగ్ ఒక 1 గంట ముందుగా అంటే సాయంత్రం 4గంటలకే ముగుస్తుందని అధికారులు తెలిపారు. 119 నియోజవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు.

దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21వేల,686 వీల్ ఛైర్లను అధికారులు సిద్ధం చేశారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించినట్లు తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు.

పోలింగ్ ప్రక్రియలో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉంటారు. 375 కేంద్ర కంపెనీల కేంద్ర బలగాలకు తోడు 65 వేల మంది రాష్ట్ర పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు చింతమడకకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు..!!

Latest News

More Articles