తెలంగాణ రైతుల కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కరెంట్ కోతలతో రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారిక సభకు సంబంధించిన ఓ వీడియోను కవిత ఇవాళ(ఆదివారం) (ఎక్స్) ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓ సభలో పాల్గొన్నారు. సభ జరుగుతుండగా కరెంట్ పోవడంతో అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీలో పవర్ కట్.. అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. అంటూ కవిత ట్వీట్ చేశారు. జీవన్ రెడ్డి ఓ పేపర్ తో గాలి విసురుకుంటున్న వీడియోను షేర్ చేశారు. కాసేపు కరెంట్ పోతేనే ఇంతగా అల్లాడిపోతున్నారు.
మీరే స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాలేదు. దీంతో మీకు ఎంత ఇబ్బంది కలిగిందో కనిపిస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇంకెంత ఇబ్బంది కలుగుతుందో మీకు అర్థమవుతోందా.. అంటూ జీవన్ రెడ్డిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు కవిత. కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని, అది చూసి రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారో తెలుసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మీరైనా కరెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ కు చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంపై పెట్టే శ్రద్ధ పాలనపైనా పెట్టాలని సీఎంకు సూచించాలని కోరారు.
అసెంబ్లీలో కరెంట్ కట్…
అధికారిక మీటింగ్ లో కరెంట్ కట్…
రైతులకు కరెంట్ కట్…సీనియర్ అయిన జీవన్ రెడ్డి గారు… కాసేపు కరెంట్ లేకపోతేనే మీరు అల్లాడిపోతున్నారు… మీరు స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాని పరిస్థితి!
మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు… pic.twitter.com/93h05trUjh— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 10, 2024