ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో నిన్న(శనివారం )అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత..వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత