Friday, May 17, 2024

బీఆర్‌ఎస్‌తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్

spot_img

తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నలిచ్చారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ దేశంలో ఏ కూటమిలోనూ లేకపోవడంతో, బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పని చేయడానికి మాయావతి అంగీకరించారని స్పష్టం చేశారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ బీఎస్పీ పొత్తు విషయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి సమావేశానికి బీఎస్పీ ఎంపీ రాంజీ.. బెహన్‌ జీ దూతగా హాజరు కానున్నట్లు ఆర్‌ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత..వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

Latest News

More Articles