Friday, May 3, 2024

ఇవాళ 132 మందికి పద్మ అవార్డులు అందజేయనున్న రాష్ట్రపతి

spot_img

ఈ ఏడాది జనవరి 25న దేశంలోని 132 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఐదు మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు.ఇవాళ‌ ( సోమవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులతో విశిష్ట వ్యక్తులను సత్కరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ అవార్డులను పంపిణీ చేయనున్నారు.

‘పద్మవిభూషణ్’ అవార్డ్ అసాధారణమైన, విశిష్ట సేవలకు అందించడం జరుగుతుంది. ఉన్నత ఆర్డర్‌లో విశిష్ట సేవలను అందించడానికి కృషి చేసిన వ్యక్తులకు పద్మభూషణ్ ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు ‘పద్మశ్రీ’ని అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తుంది.

ఆ తర్వాత దేశ రాష్ట్రపతి అధికారిక వేడుకలో గౌరవనీయ వ్యక్తులకు అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది విడుదల చేసిన అవార్డు విజేతల జాబితాలో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. ఇది కాకుండా, జాబితాలో విదేశీ, NRI, PIO, OCI కేటగిరీకి చెందిన 8 మంది వ్యక్తులు, తొమ్మింది మంది మరణానంతర అవార్డు విజేతలు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య మణిపూర్‌లో రీ పోలింగ్‌

Latest News

More Articles