Saturday, May 4, 2024

భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య మణిపూర్‌లో రీ పోలింగ్‌

spot_img

మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11బూత్‌లలో రీ పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ 7గంటల వరకు జరగనుంది. మరోసారి హింసాత్మక ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుత పోలింగ్ జరుగుతున్న బూత్‌లలో ఖురై అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. కాగా, ఈ నెల 19న జరిగిన లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో కొందరు దుండగులు ఈ పోలింగ్‌ కేంద్రాల దగ్గర కాల్పులు జరిపి ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించింది.

అంతకుముందు నిర్వహించిన పోలింగ్‌లో 69.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మిగిలిన బూత్‌లలో ఈ నెల 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా, మణిపూర్‌లో గతేడాది మే నుంచి కుకీ, మైతీ తెగల మధ్య హింస జరుగుతోంది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 65వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కుకీ తిరుగుబాటు దారులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు..14ఏళ్ల అత్యాచార బాధితురాలి 30వారాల గర్భవిచ్చితికి అనుమతి.!

Latest News

More Articles