Tuesday, May 21, 2024

నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థికి నిరసన సెగ

spot_img

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి  నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి జీవన్‌రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా.. అడ్డుతగిన మహిళలు, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్‌ ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదని వృద్ధులు నిలదీశారు.

జనవరి నెలలో ఎగ్గొట్టిన పింఛన్‌ ఎప్పుడు ఇస్తారని అడిగారు. కల్యాణలక్ష్మి చెక్కులు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మళ్లీ ఓట్లడుగుతున్నారని మహిళలు ఆగ్రమం వ్యక్తంచేశారు. ఐదు ఎకరాల కంటే అధికంగా ఉన్నవారికి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ ఎక్కడ? మీరు ఇప్పటి వరకు మాకు ఏమైనా చేసారా అంటూ ప్రశ్నించారు. జీవన్‌ రెడ్డి స్పీచ్ కు అడ్డుతగలొద్దని ఎమ్మెల్యే వారించినప్పటికీ వారు ఎంతకూ శాంతించకపోవడంతో మధ్యలోనే ప్రచారాన్ని ముగించుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: బెమెతరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

Latest News

More Articles