Saturday, May 18, 2024

సూపర్ ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 171 కిలోమీటర్లు

spot_img

టూవీలర్ కొనాలనుకునేవారికి శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ మరో రెండు మోటర్‌సైకిళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్‌ చార్జింగ్‌తో 171 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోటర్‌సైకిల్‌ను 110 సీసీ సామర్థ్యంతో సంస్థ రూపొందించింది. ఎకోడ్రైఫిట్‌ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,29,999గా నిర్ణయించింది.

Read Also: ఓటీటీలో బాలయ్య ‘భగవంత్‌ కేసరి’

3.5 కిలోవాట్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంగా దూసుకుపోనుంది. నిత్యం తిరిగేవారికి ఈ బైకుతో నెలకు రూ.7 వేల వరకు ఆదా కానున్నట్టు కంపెనీ కో-ఫౌండర్‌, సీఈవో రోహిత్‌ వదేరా తెలిపారు. ఇప్పటికే ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలో అందుబాటులో ఉంచినట్టు, కొనాలనుకునేవారు టెస్ట్‌ డ్రైవ్‌ చేసుకోవచ్చునని చెప్పారు.

Latest News

More Articles