Saturday, May 4, 2024

ఓటీటీలో బాలయ్య ‘భగవంత్‌ కేసరి’

spot_img

యువరత్న బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన హీరోగా నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ను అందుకున్నది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్నది.

Read Also: భక్తులకు అలర్ట్.. నేడు టీటీడీ టికెట్లు విడుదల

కాగా.. బాలకృష్ణకు జోడిగా కాజల్‌ నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్‌ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించగా.. ఆర్‌ శరత్‌కుమార్‌, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మించగా.. ఎస్‌ థమన్‌ సంగీతం అందించాడు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఫస్ట్‌ డే నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 30 రోజులు పూర్తయ్యేస‌రికి వరల్డ్‌వైడ్‌గా రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది మొదట్లో విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ తర్వాత మరోసారి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన బాలయ్య రెండో సినిమాగా భగవంత్‌ కేసరి నిలవడం గమనార్హం.

Latest News

More Articles