ఆసియా కప్ లో భాగంగా ఇవాళ(మంగళవారం) జరుగుతున్న ఇండియా,శ్రీలంక మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా ఒక్క సారిగా స్టేడియం దగ్గర భారీ వర్షం పడుతోంది. దీంతో గ్రౌండ్ స్టాప్ కవర్లతో స్టేడియంను కప్పేస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లాలగే 5 వికెట్లు, చరిత్ అసలంక 4 వికెట్లు తీసుకున్నారు.
టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 53 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 39, ఇషాన్ కిషన్ 33 పరుగులు చేశారు. గిల్ 19, కోహ్లీ 3, హార్దిక్ పాండ్యా 5, జడేజా 4 రన్స్ కే అవుటయ్యారు.