హైదరాబాద్: ఆవర్తన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారం రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ సహా పలు జిల్లాలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు ఆదివారం సాయంత్రం హైదరాబాద్తో పాటు నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం, మహబూ బాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.