Saturday, May 18, 2024

యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామికి రికార్డు ఆదాయం

spot_img

యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం స‌మ‌కూరింది. గ‌త 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 ల‌క్ష‌ల 16 వేల 700లు హుండీ ఆదాయం వ‌చ్చింది. ఇందులో బంగారం 167 గ్రాములు, వెండి 2 కిలోల 600 గ్రాములు ఉందని అధికారులు పేర్కొన్నారు.

అలాగే అమెరికా డాల‌ర్లు 1194, యూఏఈ దిర్హామ్స్ 140, ఆస్ట్రేలియా డాల‌ర్స్ 150, ఇంగ్లండ్ పౌండ్స్ 30, కెన‌డా డాల‌ర్స్ 45, ఒమాన్ బైసా 10,500, న్యూజిలాండ్ డాల‌ర్స్ 45, సింగ‌పూర్ 74 డాల‌ర్స్, మ‌లేషియా రింగ్గిట్స్ 69, సౌదీ రియ‌ల్స్ 27 వ‌చ్చాయని ఆలయ అధికారులు తెలిపారు.

Latest News

More Articles