టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ మోకాలి ఆపరేషన్ విజయవంతమైంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రిషబ్ గాయపడ్డాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం పంత్ ను డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు.
కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్ లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పంత్ ను ముంబై కి ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంత్ మోకాలికి నిన్న(శుక్రవారం) ఆపరేషన్ నిర్వహించారని, సర్జరీ విజయవంతమైందని బీసీసీఐ తెలిపింది.