హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయింది. కాగా.. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహారించడంతో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోఠి నుంచి పటాన్చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కేబీఆర్ పార్కు వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
Also Read.. రూ. 50 వేలు మించి నగదు ఉంటే సీజ్ చేస్తాం
డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పార్కు ఫుట్పాత్ను ఢీకొట్టి బస్సును నిలిపారు. ఈ సమయంలో సుమారు 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఎవరికీ గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తప్పించినందుకు డ్రైవర్ వెంకటేష్ గౌడ్ ను ప్రయాణికులు అభినందించారు.