Sunday, May 19, 2024

అసెంబ్లీ ఎన్నికలు.. తనిఖీల్లో రూ.74 కోట్లు సీజ్

spot_img

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అక్రమ మద్యం, నగదును సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 4 కోట్ల 72 లక్షల 52వేల 850 విలువగల 133832 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే రూ. 48 కోట్ల 32 లక్షల 99వేల 968 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Also Read.. మేడ్చల్ లో భారీగా నగదు పట్టివేత

వీటితోపాటు 37.4 కేజీల బంగారం, 365 కిలోల వెండి ( 1కోటి 75 లక్షల2 వేల 116 రూపాయలు) సీజ్ చేశారు. మరో 1 కోటి 90 లక్షల 80 వేల 553 రూపాయల విలువగల ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎన్నికల కోడ్ నుండి ఇవాళ్టి వరకు 74 కోట్ల 95 లక్షల 31వెయ్యి 197 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Latest News

More Articles