దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా అన్ని రకాల కార్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంది. ఈనెల 15 వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇగ్నిస్, బాలెనో, సియాజ్ మోడల్ కార్లపై ‘ప్రీ నవరాత్రి‘ బుకింగ్స్ స్కీం కింద రూ.5000 వరకూ రాయితీ అందిస్తోంది. దీంతో పాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్లు, క్యాష్ డిస్కౌంట్లలో రాయితీలు అందిస్తోంది.
డిజైర్పై రూ.17 వేలు వరకూ డిస్కౌంట్, మారుతి బ్రెజాపై రూ.45 వేలు.. స్విఫ్ట్ పై రూ.47 వరకూ క్యాష్ రాయితీ ఇస్తోంది. సియాజ్పై రూ.53 వేల డిస్కౌంట్..బాలెనోపై రూ.53 వేలు,వ్యాగన్ఆర్ పై రూ.58 వేలు,ఇగ్నిస్ పై రూ.65 వేలు, ఆల్టో కే 10 పై రూ.68 వేలు, ఎస్-ప్రెస్సో పై రూ.68 వేలు,సెలెరియోపై రూ.68 వేల డిస్కౌంట్ ఇస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం