Thursday, May 2, 2024

ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం

spot_img

హైదరాబాద్ అశోక్ నగర్ లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య పై మిస్టరీ ఛేదించారు పోలీసులు. వరంగల్ జిల్లా దుగ్గండి గ్రామంకి చెందిన ప్రవల్లిక మృతికి ప్రేమ వ్యవహారామే కారణమని తెలిపారు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు. ప్రవల్లిక మృతికి, గ్రూప్-2 పరీక్షల వాయిదాకు సంబంధం లేదని చెప్పారు.

23 ఏళ్ల మర్రి ప్రవల్లిక..శివరాం రాథోడ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని..ఈ ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసునని అన్నారు. అయితే ఇటీవల శివరాం రాథోడ్ కు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. దీంతో మనస్థాపానికి గురై ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

అయితే ఈ విషయాన్ని కొన్ని పార్టీలకు చెందిన కొందరు ఆందోళన చేశారు. ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంది అని దుష్ప్రచారం చేశారన్నారు. తన ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్ నోట్ తో పాటు,సీసీ ఫుటేజ్,సెల్ ఫోన్ చాటింగ్ ద్వారా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిందితుని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ వెంకటేశ్వర్లు. అంతేకాదు..అల్లర్లకు పాల్పడిన వారిపై కూడా కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు తొందరపడి నిజానిజాలు తెలుసుకోకుండా ఆవేశాలకు పోకుండా గొడవలు చేయవద్దని సూచించారు.

ఇది కూడా చదవండి: మేడ్చల్ లో భారీగా నగదు పట్టివేత

Latest News

More Articles