Sunday, May 12, 2024

అరవింద్ ఓ దౌర్భాగ్యుడు. ఈసారి డిపాజిట్ కూడా రాదు

spot_img

హైదరాబాద్: పదేళ్ల కింద నిజామాబాద్ జిల్లా ఎట్లుండే ఇపుడు ఎలా ఉండే ప్రజలందరికీ తెలుసు అని  ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాల‌యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలుగా తాము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామని తెలిపారు. నిజామాబాద్ కు ఐటీ హబ్ తో యువత కు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు.

అరవింద్ ఓ దౌర్భాగ్యుడు అని, ఆయన ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ 20 ఏండ్లు వెనక్కి పోయిందన్నారు. అరవింద్ సోషల్ మీడియా లోనే ఎక్కువ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇపుడు గెలిచే పరిస్థితి లేదన్న ఆయన డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఎంపీ గా ఇంకా నాలుగు ఐదు నెలల పదవీకాలం ఉందని, అరవింద్  దీన్నయినా సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు.

అరవింద్ ఓ పని దొంగ. పని చేసే మమ్మల్ని విమర్శించడం మానాలి. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతా అన్నారు. ఆయనే జైలుకు వెళ్లారు. పైన తధాస్తు దేవతలు ఉంటారు. ఇపుడు  కేసీఆర్ కు పిండం పెడతా అంటున్నారు. రేవంత్ కే పిండం పెట్టడం ఖాయం. మంచిగా మాటలు మాట్లాడటం చేత కాకపోతే ఆ నేతలను తమ నేతలు విడిచిపెట్టరని హెచ్చరించారు.

బీజేపీ ఎప్పటికీ మాకు పోటీ కాదు : ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎంపీ ధర్మపురి అరవింద్ కు కూల గొట్టడమే తెలుసు అందుకే మా అభివృద్ధి పనులు పాడు కావాలని కోరుకుంటున్నాడని ఎమ్మెల్యే గణేష్ బిగాల విమర్శించారు. అరవింద్  చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎప్పటికీ మాకు పోటీ కాదన్నారు. అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Latest News

More Articles