Thursday, May 2, 2024

పాతబస్తీ మెట్రో: మంత్రి కేటీఆర్‌తో అక్బ‌రుద్దీన్‌ ఓవైసీ కీలక భేటీ

spot_img

హైదరబాద్‌ నగరం మెట్రో రైల్‌ మాస్టర్ ప్లాన్‌, ఎయిర్‌పోర్టు మెట్రో వ్యవస్థపైన గురువారం మెట్రోరైల్‌ భవనంలో మంత్రి కేటీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్‌ మాస్టర్‌ప్లాన్‌పై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు.

ఈ సమావేశం తర్వాత ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బ‌రుద్దీన్‌ ఓవైసీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌ పనులపై చర్చించారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌కి అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే కారిడార్‌ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు కేటీఆర్. ఫలక్‌నుమా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌.

Latest News

More Articles