న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సెప్టెంబరు 9-10 తేదీల్లో జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకావట్లేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ప్రస్తుతం తమ దృష్టంతా ప్రత్యేక సైనిక చర్య పైనే ఉందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో బ్రిక్స్ సదస్సు కు కూడా పుతిన్ హాజరుకాలేదు. కాగా.. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ-20 సదస్సుకు కూడా పుతిన్ గైర్హాజరయ్యారు.