Sunday, May 19, 2024

ముగిసిన సాయి చంద్ అంత్యక్రియలు..!

spot_img

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయి చంద్ అంత్యక్రియలు ముగిసాయి. అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు అభిమానులు. సాయిచంద్ చితికి కుమారుడు నిప్పు పెట్టగ.. జోహార్ సాయి చంద్ అంటూ నినదించారు బీఆర్ఎస్ నేతలు, స్నేహితులు, అభిమానులు.

ఇక సాయి చంద్ ని కడసారి చూసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు. సాయిచంద్ అంతిమయాత్ర సాహెబ్ నగర్ స్మశాన వాటిక వరకు అంత కూడా పాటలతో మారుమ్రోగిపోయింది.

Latest News

More Articles