హైదరాబాద్: ‘సేమ్ డే డెలివరీ’ పేరుతో ఫ్లిప్కార్ట్ తన కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ ప్రారంభిస్తోంది. ఆర్డర్ చేసే వస్తువులను అదే రోజు డెలివరీ చేయనుంది. ముందుగా ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనున్నారు. హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, కోల్కతా, లఖ్నవూ, లుథియానా, భువనేశ్వర్, ముంబయి, నాగ్పూర్, పుణె, పట్నా, రాయ్పుర్, దిల్లీ, గువాహటి, ఇందౌర్, జైపుర్, సిలిగురి నగరాల్లో ఈ సేవల్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ సేవలను తీసుకురానున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట లోపు వస్తువులను ఆర్డర్ చేస్తే.. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వస్తువులను డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినవాటిని మరుసటి రోజు డెలివరీ చేస్తారు.
Also Read.. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి..!!