హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లోనూ ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు సెలవు ఇచ్చారు. అయితే దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది ప్రభుత్వం. ముస్లింలు షబ్-ఎ-మెరాజ్ ను పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు రాత్రంతా జాగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.