అమరావతి: సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22వ తేదీన(సోమవారం) పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఇంతకుముందు జనవరి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని టీచర్లు, విద్యార్థుల నుంచి డిమాండ్లు రావడంతో ప్రభుత్వం సంక్రాంతి సేలవులను పొడిగించింది.
Also Read.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే.. వాళ్ళిచ్చిన హామీలు అమలవుతాయి