Sunday, May 5, 2024

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

spot_img

సిరిసిల్లలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల నేతన్నల్లకు మద్దత్తుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నాయకులు. మొన్న కేటీఆర్ మొదటగా ఈ విషయంపై స్పందించగా నేడు తాజాగా బండి సంజయ్ కూడా మాట్లాడారు.

సిరిసిల్ల చేనేత పరిశ్రమపై ఆధారపడిన 20 వేల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను సైతం రాశారు. ఖర్చులు పెరగడం, లాభసాటి ధర లేకపోవడం, పాలిస్టర్‌కు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో నేత కార్మికులు మరమగ్గాలను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంజయ్ తెలిపారు.

Latest News

More Articles