Saturday, May 18, 2024

బండి మా పార్టీలో చేరతానని అనలేదా.. నేను సాక్ష్యం కూడా చెప్తా

spot_img

కరీంనగర్  జిల్లా: బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే…వారిద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారని సివిల్ సప్లై ఛైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కర్ణాటక వెళ్లి కాంగ్రెస్ కి ఓటు వేయాలని అంటాడు సంజయ్. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సీఎం ని కలిపియ్యండి అని బండి సంజయ్ నాతో స్వయంగా అన్నారు. పార్టీలో చేరతా అన్నారని చెప్పారు. బండి సంజయ్ మా పార్టీలో చేరతానని అనలేదా.. నేను సాక్ష్యం కూడా చెప్తా అని సవాల్ చేశారు.

బండి సంజయ్ కరీంనగర్ కి ఎం చేశారో చెప్పాలి. మేము అభివృద్ధి చేస్తున్నాం అందుకే మీ పార్టీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనేక అవార్డులు ఇస్తోంది. కేంద్రం మాకు అవార్డులు ఇస్తోంటే… ఇక్కడ బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. నోరు జారితే జాగ్రత్త సంజయ్… ఉన్న సీట్లు కూడా పోతాయని హెచ్చరించారు.

Latest News

More Articles