Saturday, May 4, 2024

స్వతంత్ర సంగ్రామం తర్వాత.. తెలంగాణ ఉద్యమం మాత్రమే లక్ష్యాన్ని చేరింది

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం  అనేది భారతదేశంలో స్వతంత్ర సంగ్రామం తర్వాత జరిగిన ప్రజా ఉద్యమాలలో లక్ష్యాన్ని ముద్దాడిన మొదటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి అనేక మంది కృషి చేశారు. అనేకమంది బలిదానాలు చేశారు. అనేక మంది సంయుక్తంగా చేసిన కృషి తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మనమందరం పనిచేయడం జరుగుతుంది. 10 ఏళ్లలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఇక జరిగే అభివృద్ధి మన రాష్ట్రానికే కాకుండా దేశానికి రోల్ మోడల్ గా ఉండనుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర దశాబ్ది దినోత్సవ శుభాకాంక్షలను ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు.

Latest News

More Articles