Wednesday, May 22, 2024

దంచికొడుతున్న వానలు.. రెండు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్‌

spot_img

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో కడలూర్‌, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. ఇక చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్‌ జిల్లాల్లో, పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Latest News

More Articles