Tuesday, May 21, 2024

క్యాటరింగ్ చేసి వస్తుండగా ఢీకొన్న మినీ ట్రక్.. ముగ్గురు యువకులు మృతి

spot_img

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. భీమారం మండలం, రాగోజి పేటకు చెందిన అభిషేక్ (18), భీమారం మండల కేంద్రానికి చెందిన మొయిన్ ఖాన్ (17), నాని (18) క్యాటరింగ్ బాయ్స్ గా పనిచేస్తున్నారు. వీరు బుధవారం రాత్రి కొడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన ఓ శుభకార్యంలో క్యాటరింగ్ చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యాక్టివా బైకు మీద భీమారం మండలానికి తెల్లవారుజామున బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న స్కూటీని.. కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామం వద్ద ఓ మినీ ట్రక్ ఢీకొట్టింది. దాంతో ముగ్గురూ పక్కనున్న ఖాళీ పంటపొలాల్లో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన ముగ్గురిలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. ఒకే మండలానికి చెందని ముగ్గురు యువకులు ఒకేసారి చనిపోవడంతో అటు రాగోజిపేటలో, ఇటు భీమారంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

Latest News

More Articles