Sunday, May 12, 2024

గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించిన ముస్లిం, మైనార్టీలు

spot_img

సికింద్రాబాద్: అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న గులాబీ పార్టీకి మరోసారి మద్దతు పలకాలని ముస్లిం, మైనార్టీ వర్గాల ప్రజలు నిర్ణయించారు. కేసీఆర్ సర్కారుకే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Also Read.. కోరుట్లలో ఎంపీ అరవింద్ కు బిగ్ షాక్

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 3వ వార్డు పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత పాదయాత్ర నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. గతంలో లాగే సంక్షేమ పథకాల బీఆర్ఎస్ సర్కారును భారీ  మెజార్టీతో ఆశీర్వదించాలని విన్నవించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

Also Read.. కొండా అలక, ఈటల సీరియస్.. అసలు బీజేపీలో ఏం జరుగుతుంది ?

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రజా మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. 400 రూపాయలకే గ్యాస్ ఇస్తానని చెప్పడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని.. ఇంకా పెంచుతానని చెప్పడం సీఎం కేసీఆర్ కే సాధ్యమన్నారు.

Latest News

More Articles