బీజేపీకి మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కీలక నేతలు డీకే అరుణ, విజయశాంతిలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తే గద్వాలలో తన గెలుపు కష్టమని డీకే అరుణ భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఫస్ట్ లిస్ట్ తర్వాత పార్టీ తీరుపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరో నేత విజయశాంతి కూడా పార్టీలో జరిగే పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన గుర్తింపు రావడం లేదని ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె కొన్ని రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.