నాగపూర్-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతిచెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. పోలీపులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పుణె నుంచి మెహకర్ వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. గాయపడ్డ వారిని సింద్కేదార్రాజా హాస్పిటల్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.