పాకిస్తాన్ వెటరన్ ఆల్ రౌండర్ షోయభ్ మాలిక్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే మూడో పెండ్లి చేసుకున్న మరుసటి రోజే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడేందుకు వెళ్లాడు. బీపీఎల్లో ఫార్చ్యూన్ బరిషల్ తరఫున మాలిక్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఖుల్నా టైగర్స్తో జరిగిన మ్యాచ్లో వరుసగా మూడు నోబాల్స్ వేయడంతో ఫిక్సింగ్ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఆరోపణలతో ఫార్చ్యూన్ జట్టు మాలిక్ బీపీఎల్ కాంట్రాక్టును రద్దు చేసింది.
ఖుల్నా టైగర్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో వరుసగా మూడు నోబాల్స్ వేయడంతోపాటు 18 పరుగులు ఇచ్చాడు. మాలిక్పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఫార్చ్యూన్ మేనేజ్ మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాలిక్ ఇటీవలే సానియా మీర్జాతో వివాహ బంధాన్ని తెంచుకుని పాక్ వర్ధమాన నటి సనా జావేద్ను మూడో వివాహం చేసుకున్నాడు.
Also Read.. చంద్రబాబుపై పవన్ గుస్సా…పొత్తుల విషయంలో జనసేనాని అసహనం..!!