ఏపీ: ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు వెళుతున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేటకు వెళుతుంది.
లింగంగుంట్ల బస్స్టాప్ వద్ద ఆటోను ఆర్టీసీ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని కూలీల్లో యాకసిరి హనుమాయమ్మ(60), గన్నవరపు శివపార్వతి (58), షేక్ హజరత్ వలీ (65)మృతి చెందారు. గాయపడిన 13 మందిలో గోరంట్ల శివకుమారి (60), సురుగుల కోటేశ్వరమ్మ (60)ల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
Also Read.. బీజేపీ పార్టీ ప్రతినిధిలా తమిళిసై వ్యాఖ్యలు.. కడియం, పల్లా ఫైర్