Wednesday, May 22, 2024

ఎవరెస్ట్ ఫుడ్స్ మసాలపై  నిషేధం..!

spot_img

మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు.. భారతీయ ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ ఫుడ్స్ కి చెందిన పలు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించిందంటూ వస్తున్న వార్తలపై ఎవరెస్ట్ ఫుడ్స్ స్పందించింది. తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించలేదని వివరణ ఇచ్చింది. సింగపూర్‌లో 1 ఉత్పత్తిని రీకాల్ చేశారని తెలిపింది. ఎవరెస్ట్‌ ఉత్పత్తులను ఏ దేశంలోనూ నిషేధించలేదంది. హాంకాంగ్ నిర్ణయం నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ఒక ఉత్పత్తిని రీకాల్‌ చేసిందని తెలిపింది. రీకాల్ చేసిన ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని తమ సింగపూర్ దిగుమతిదారుని ఆ దేశ ప్రభుత్వం కోరిందన్నారు.

కంపెనీకి చెందిన 60 ఉత్పత్తులల్లో కేవలం దానిని మాత్రమే రీకాల్ చేశారని వివరించింది. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, అధిక నాణ్యత కలిగినవని ఈ సందర్భంగా వినియోగదారులకు ఎవరెస్ట్ కంపెనీ హామీ ఇచ్చింది. కాగా ఎండీహెచ్ ప్రైవేటు లిమిటెడ్, ఎవరెస్ట్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌‌కు సంబంధించిన మసాల ఉత్పత్తుల అమ్మకాలపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే సింగపూర్ ప్రభుత్వం కూడా నిషేధం విధించిందని తెలిపాయి. ఈ కంపెనీలు అమ్ముతున్న పలు మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించామని, పరిమితికి మించిన మోతాదులో ఉన్నట్టు తేలిందని, అందుకే హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించిందని కథనాలు వచ్చాయి.

కాగా, భారతీయ మసాలా దినుసుల బ్రాండ్లకు విదేశాల్లో రీకాల్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2023లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ.. ఎవరెస్ట్ ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందని గుర్తించి వాటిని రీకాల్ చేయాలని ఇప్పటికే ఆదేశించింది.

ఇది కూడా చదవండి:హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనీ బీజేపీ కుట్ర

Latest News

More Articles