తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ పార్థివ దేహాన్ని గుర్రంగూడలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం తర్వాత సాయిచంద్ అంతిమ యాత్ర ఆయన స్వగృహం నుండి ప్రారంభమై వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్హౌస్కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.