Monday, May 13, 2024

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కను నాటిన సింగర్ శ్రేయా ఘోషల్‌

spot_img

బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో ప్రఖ్యాత  బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్‌ మొక్కను నాటారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కను నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గొప్ప సామాజిక కార్యక్రమమని అన్నారు శ్రేయా ఘోషల్‌. దీనిలో పాల్గొని మొక్కను నాటడం సంతోషంగా ఉందన్నారు.

మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ప్రకృతికి, పాటకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఆ రెండింటి సమన్వయంతో మనం సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటామన్నారు.

Latest News

More Articles