Sunday, April 28, 2024

సంక్షేమ పథకాలు వద్దంటున్న BJP, కాంగ్రెస్ పార్టీ లకు గొల్ల కుర్మలు బుద్ధి చెప్పాలి..!

spot_img

సిద్దిపేట బైరి అంజయ్య గార్డెన్ లో రెండవ విడత గొర్రెల పంపిణీపై జరిగిన అవగాహన సదస్సుకి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, MLC యాదవ రెడ్డి,ZP చైర్ పర్సన్, గొల్ల కుర్మ సహకార సంఘం జిల్లా చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్ లు హాజరైన ఈ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో 17 వేల మంది గొల్ల కుర్మ లబ్దిదారులతో సభ నిర్వహిద్దాం. అందరికీ భోజనం నేనే పెడతా. ఇతర రాష్ట్రాల నుండి మాంసాన్ని దిగుమతి చేసుకోకుండా ఇక్కడి గొల్ల కుర్మలకే గొర్రెలు ఇచ్చి మాంసం ఉత్పత్తి చేయడం కోసం 11 వేల కోట్ల రూపాయలతో పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నాయకులు,ఇతర ప్రాంతాల ప్రతిపక్ష నాయకులు సైతం తెలంగాణ అభువృద్ధిని మెచ్చుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హైదరాబాద్ ను చూసి ఆశ్చర్య పోయి ఇది హైదరాబాద్ ఆ న్యూయార్క్ సిటీ ఆ అని కేసీఆర్ ప్రభుత్వ పనితీరును అభినందించారు. గొల్ల కుర్మల నైపుణ్యాన్ని, గొప్పదనాన్ని CM కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కొనియాడారు. సంక్షేమ పథకాలు వద్దంటున్న BJP, కాంగ్రెస్ పార్టీ లకు గొల్ల కుర్మలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని చెప్పారు మంత్రి హరీష్ రావు.

Latest News

More Articles