Sunday, May 19, 2024

 ఉత్తరాఖండ్‌లో కాలువలో కారు పడిపోయి ఆరుగురు దుర్మరణం

spot_img

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్‌బాగ్‌ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు వ్యక్తులు ఉండగా.. అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడగా చికిత్స నిమిత్తం డెహ్రాడూన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కారు చెట్టును ఢీ కొని ముగ్గురు మృతి

Latest News

More Articles