తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా వినయ్ కృష్ణా రెడ్డి, రవాణా-రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీష్, టీఎస్ఐఆర్డి సీఈఓగా కాత్యాయని, గనులు-భూగర్భ శాఖ డైరెక్టర్గా సుశీల్ కుమార్ నియమితులయ్యారు.