ప్రియుడు దూరం పెట్టాడని ఓ ప్రియురాలు సూసైడ్ చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో చోటుచేసుకుంది. అత్తాపూర్కు చెందిన అతిథి భరద్వాజ్ స్థానికంగా హ్యాఫీ హోమ్ ఫార్చూన్ అపార్ట్మెంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఆమె తన ఫ్లాట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్లాట్ ఆమె ఎంతసేపటకి బయటకు రాకపోవడంతో.. పక్క ఫ్లాట్ వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అతిథి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: కిరాణా షాపుకొచ్చిన తల్లికొడుకులపై దాడి చేసిన వీధి కుక్కలు
కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఓ యువకుడిని ప్రేమించిందని, అయితే కొద్దిరోజులుగా సదరు వ్యక్తి ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యువకుడు తనను మోసం చేశాడని, బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.