రంగారెడ్డి జిల్లా మణికొండలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కిరాణా కొట్టుకు వెళ్లిన తల్లీకొడుకులపై దాడి చేశాయి. ఈ దారుణ ఘటన శ్రీనివాస నగర్ కాలనీలో ఆదివారం జరిగింది. కిరాణ కొట్టుకు వచ్చిన యువకుడి కాళ్లు పట్టుకొని వీధి కుక్క చీల్చి చెండాడింది. కుక్కను వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన తల్లిపై కూడా దాడి చేశాయి. ఈ ఘటనలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల్లో ఐదుగురిపై కుక్కలు దాడి చేయడం గమనార్హం. వీధి కుక్కల దాడి నుండి తమను రక్షించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు.