Friday, May 17, 2024

ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించిన సౌత్ ఆఫ్రికా

spot_img

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ (శ‌నివారం) ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదిక‌గా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్ మద్య జ‌రిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టు 229 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జ‌ట్టు ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను పరుగులు పెట్టించింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 399 పరుగులు చేసి 400 ప‌రుగుల భారీ టార్గెట్ ను ఇచ్చింది.

400 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు..22 ఓవ‌ర్ల‌లో కేవలం 170 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. 10 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అంతేకాదు.. 170 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది.

అంతకముందు బ్యాటంగ్ చేసిన సౌత్ఆఫ్రికా బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (109) సెంచ‌రీతో చెల‌రేగాడు. హెండ్రిక్స్ (85), వాన్ డెర్ డస్సెన్ (60), మార్కో జాన్సెన్ (75) హాఫ్ సెంచ‌రీలు చేశారు. మార్క్ రామ్ (42) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో రీస్ టాప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీసుకున్నాడు. గుస్ అట్కిన్సన్ కూడా రెండు వికెట్లు ద‌క్కించుకున్నాడు.

ఇది కూడా చదవండి: నెద‌ర్లాండ్స్ పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం

 

Latest News

More Articles