Friday, May 3, 2024

ఈనెల 27న మహబూబాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ సభ

spot_img

మహబూబాబాద్‌: ఈ నెల 27న మహబూబాబాద్‌లో 70వేల మందితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.  సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌తో కలిసి సభాస్థలిని పరిశీలించారు.  మహబూబాబాద్‌ జిల్లా అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Also Read.. ఎన్నికల కోడ్: రాష్ట్రంలో రూ.300 కోట్ల సొమ్ము సీజ్

కాంగ్రెస్‌, బీజేపీ అధికారం కోసం పుట్టిన పార్టీలని.. పేద ప్రజలకు అండదండగా ఉన్న పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్‌, బీజేపీ నైజమని, ఆ పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Latest News

More Articles