కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులు సంధించి సఫారీలకు పట్టపగలే చుక్కలు చూపించాడు. సిరాజ్ (6/15) ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది.
Also Read.. జనవరి 5 నుంచి ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యం సమ్మె
సఫారీ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్హమ్ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బుమ్రా (2/25), ముకేశ్ కుమార్ (2/0) కూడా రాణించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్పై ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.