బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. సీఎం జగన్ గురువారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను జగన్ కలిసి పరామర్శించనున్నట్లు సమాచారం. కాగా, కేసీఆర్ ఇటీవలే తన ఫామ్హౌస్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే.
సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. కేసీఆర్ను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.